వైయస్ బతికుంటే..: డిఎల్, జగన్పై బాలయ్య నిప్పులు
కడప/అనంతపురం: వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయన అమెరికా జైలులో ఉండేవారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం కడప జిల్లాలో అన్నారు. వైయస్ ఇప్పుడు సజీవంగా ఉంటే టైటానియం కుంభకోణం విషయంలో విదేశాల జైల్లో ఉండేవారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ బచ్చా అన్నారు. ప్రతి ఒక్కరు టిడిపికి ఓటు వేయాలని గ్రామస్థులను కోరారు.
అనంతలో బాలకృష్ణ
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి గొప్పతనాన్ని ఎన్టీఆర్, చంద్రబాబులు చాటితే.. కాంగ్రెసు పార్టీ మాత్రం అంతర్జాతీయ కుంభకోణాల్లో కూరుకుపోయి పరువు తీసిందని హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలో అన్నారు.
కాంగ్రెస్, అవినీతి, అరాచకాలు ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్టను మసకబార్చాయన్నారు. వైయస్ అక్రమాలు పరదేశంలో తెలుగోడి పరువు తీశాయన్నారు. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న జగన్, ఆ అవినీతి సొమ్ముపై వైయస్సార్ కాంగ్రెసు పునాదులు వేసి ఎన్నికల్లో కల్లిబొల్లి మాటలతో ప్రజలన మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఓట్లు, సీట్లను నోటల్తో కొలిచే వ్యక్తులకు బుద్ధఇ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం ఆరాటపడుతున్న జగన్, అధికారంలోకి వచ్చాక దాన్ని అడ్డం పెట్టుకొని కేసులు మాఫీ చేయించుకుంటారన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెసు కుటిల నీతికి నిదర్శనమన్నారు. కాంగ్రెసు పార్టీని ఓడించాలన్నారు.