మహాలక్ష్మి శరీరంలోని 59 ముక్కలు అతికించి పోస్టుమార్టుం, తల ప్రాణం తోకలోకి
ఐటీ హబ్ బెంగళూరులోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ కు చెందిన మహాలక్ష్మి హత్య కేసులో బౌరింగ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మహాలక్ష్మి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. బౌరింగ్ ఆసుపత్రి వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. పీస్ పీస్ అయిన మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం చేయడం వైద్యులకు పెద్ద సవాలుగా మారింది.
మహాలక్ష్మి పోస్టుమార్టం ఎలా చేశారో చూసి పోలీసులు షాక్ అయ్యారని తెలిసింది. ముందుగా మహాలక్ష్మి శరీరంలోని ఒక్కో ముక్కకు నెంబర్లు వేశారు. ఆ తర్వాత రేడియోలాజికల్ పరీక్ష, ప్రతి ముక్క యొక్క సీటీ స్కాన్ ఎక్స్-రే కూడా జరిగింది. ఆ తరువాత, ఎంచుకున్న ముక్కల టాక్సికాలజికల్ పరీక్ష జరిగింది. ఎంచుకున్న ముక్కల రోగలక్షణ పరీక్ష కూడా జరిగింది. చివర్లో మహాలక్ష్మి శరీరంలోని ముక్కలకు డీఎన్ఏ పరీక్ష చేశారు.

అయితే మరీ అవసరమైతే బాడీ రీఅ సెంబుల్ కూడా చేస్తామని వైద్యులు మొదట చెప్పారు. చివరకు కనుగొన్న వాటి ఆధారంగా ఒక నివేదికను విడుదల చేస్తారు.పోస్టుమార్టంలో మహాలక్ష్మి తలను హంతకుడు మూడు భాగాలుగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఛిద్రమైన మహాలక్ష్మి మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులంతా దిగ్భ్రాంతి చెందారు. మహాలక్ష్మి మృతదేహం ఎలా నరికి వేయబడిందో చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారని కన్నడ మీడియా తెలిపింది.
ఛిద్రమైన మహాలక్ష్మి మృతదేహాన్ని అమర్చి పోస్టుమార్టం నిర్వహించారు. దశలవారీగా మహాలక్ష్మి శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో పోస్టుమార్టంకు కూడా చాలా సమయం పట్టింది. దహన సంస్కారాలు చెయ్యడానికి: మహాలక్ష్మి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. మహాలక్ష్మి అంత్యక్రియలు లాలాబాగ్లోని శ్మశాన వాటికలో జరిగాయని ఆమె బంధువులు చెప్పారు.
ఈలోగా ఈ కేసులో బెంగళూరు పోలీసులకు తొలి విజయం సాధించారు. హత్యకు గురైన మహాలక్ష్మి స్నేహితుడైన శశిధర్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని వయ్యాలికావెల్ పోలీసులు శశిధర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా కొంత మంది కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. మహాలక్ష్మికి సన్నిహితంగా ఉంటున్న వాళ్లు కొందరు మాపిపోయారని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications