మగాళ్లు మారాలి: అసదుద్దీన్, రేపిస్టులకు బెయిలొద్దని..
దేశంలో ప్రతి ఇరవై రెండు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతున్నట్లు క్రైం రికార్డ్బ్యూరో సేకరించిన వివరాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. 2013లో 33,707 మానభంగం కేసులు నమోదు కాగా శిక్షలు మాత్రం కేవలం 27.1 శాతం మాత్రమేనని ఒవైసీ తమ విచారాన్ని వ్యక్తం చేశారు. నమోదు అయిన కేసులే ఇన్ని ఉంటే ఇక నమోదు కాని కేసులు ఎన్ని ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు.
మహిళలపై అత్యాచారాల కేసులు మూడు లక్షల పదివేలుంటే శిక్ష మాత్రం కేవలం ఇరవై రెండు శాతం మందికే పడిందన్నారు. నిర్భయ చట్టం ఏర్పడిన తరువాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 374, 389 సెక్షన్లకు మార్పులు చేయవలసిన అవసరం ఎంతో ఉందని ఒవైసీ సూచించారు.
ట్రయల్ కోర్టులో శిక్ష పడిన తరువాత నిందితులు అప్పిలేట్ కోర్టులో శిక్షను సస్పెండ్ చేయించుకుంటున్నారని ఆయన తెలిపారురు. నిర్భయ చట్టం ఏర్పడిన తరువాత కూడా దాదాపు 90శాతం మంది నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని ఒవైసీ తెలిపారు. ముజఫర్నగర్ కేసుల విషయంలో ఒక్క చార్జిషీట్ కూడా దాఖలు చేయకపోవటం సిగ్గు చేటని ఆయన దుయ్యబట్టారు.