పద్మలత, రాజు హత్యలు: ప్రధాని నిందితుడు డీఎస్పీ రవిబాబు లొంగుబాటు
రెండు హత్యల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం లొంగిపోయారు. రౌడీ షీటర్ హత్య కేసులో రవిబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కిరాయి హంతకులతో గే
విశాఖపట్నం: రెండు హత్యల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం లొంగిపోయారు. రౌడీ షీటర్ హత్య కేసులో రవిబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కిరాయి హంతకులతో గేదెల రాజును డీఎస్పీ చంపించినట్లు ఆరోపణలున్నాయి.

వివాహేతర సంబంధంతో పద్మలత హత్య..
గతంలో మాజీ ఎమ్మెల్యే కూతురు పద్మలతతో డీఎస్పీ రవిబాబు వివాహేతర సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పద్మలతను గేదెల రాజుతో హత్య చేయించిన డీఎస్పీ రవిబాబు.. ఇందు కోసం కోటి రూపాయలు మాట్లాడుకుని.. రూ.50లక్షలు అతనికి అందించినట్లు తెలిసింది.

ఆ నిజం బయటపడకుండా రాజు హత్య
కాగా, మిగితా సొమ్ము ఇవ్వకుంటే హత్య విషయాన్ని బహిర్గతం చేస్తానని బెదిరింపులకు గురిచేయడంతో.. పద్మలత హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు రాజును కూడా హత్య చేయించారు రవిబాబు.

మరో ఇద్దరు మిగిలారు..
గేదెల రాజు హత్య కేసులో మొత్తం 12మంది నిందితులుండగా, ఇప్పటికే 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన రవిబాబు కూడా లొంగిపోవడంతో మొత్తం పోలీసుల అదుపులో ఉన్న వారిక సంఖ్య 10కి చేరింది. మరో ఇద్దరినీ అరెస్ట్ చేయాల్సి ఉంది.

వ్యూహత్మకంగానేనా?
అయితే, వ్యూహత్మకంగానే డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. తనకు ఆ హత్యలతో సంబంధం లేదని, న్యాయస్థానంలోనే పోరాడతానని రవిబాబు చెప్పినట్లు తెలిసింది. కాగా, పోలీసులు డీఎస్పీ రవిబాబును కోర్టు ముందు కస్టడీకి కోరే అవకాశం ఉంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications