వ్యభిచారం చేస్తూ పట్టుబడిన టిటిడి ఉద్యోగిపై వేటు

శంఖుమిట్ట ఉప విచారణ కార్యలయ ఉగ్రాణం గుమస్తాగా పనిచేస్తోన్న సమయంలో పి. గోపీనాథ్ గత ఏడాది ఉగ్రాణంలోనే సులభ కార్మికురాలితో వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీరిని తితిదే నిఘా, భద్రతా విభాగం సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. వెంటనే నిందితులను పోలీసులకు అప్పగించారు.
అనంతరం బదిలీ వేటువేసి టిటిడి విచారణ చేపట్టింది. ఈ విచారణలో వాస్తవాలు తేలండతో నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తొలగింపు ఉత్తర్వులను దేవస్థానం గోదాం అసిస్టెంటుగా పనిచేస్తోన్న గోపీనాథ్కు బుధవారం అందజేసింది.
ఇదే సమయంలో తితిదే గుర్తింపు కార్డు, లడ్డూ కార్డులను స్వాధీనం చేసుకుంది. ఇలాంటి చర్య దేవస్థానంలో ప్రధమంగా జరిగినట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications