ఉచిత బస్సుల్లో మహిళలకు మరో గుడ్ న్యూస్..! గుర్తింపుకార్డులపై..!
మహిళలకు ఉచిత బస్సు అందిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణాలు చేసేటప్పుడు గుర్తింపు కార్డు చూపించాలనే నిబంధన పెడుతున్నాయి. అయితే ఏ రాష్ట్రం బస్సులో ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా తిరుగుతాయి. అలాగే అందులో ప్రయాణించే మహిళలకు కూడా సాధారణంగా ఆ రాష్టానికి చెందిన వారే ఉంటారు. అటువంటప్పుడు వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు గుర్తింపు కార్డులు చూపించాలనే నిబంధన అవసరమా అనే చర్చ జరుగుతోంది.
ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అందిస్తున్న స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా గుర్తింపు కార్డులు చూపించి ప్రయాణాలు చేయాలనే రూల్ పెట్టారు. అయితే దీని వల్ల అదనంగా ప్రభుత్వానికి కలుగుతున్న లాభం అంటూ ఏమీ లేదు. కానీ ఆర్టీసీ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందట. ఇదే విషయాన్ని తాజాగా ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్న మహిళల్లో పెద్దగా ఇతర రాష్ట్రాల వారు లేకపోవడంతో గుర్తింపు కార్డులు చూపించాలనే నిబంధన తీసేయాలని ఈయూ నేతలు తాజాగా సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధన వల్ల కండక్టర్లపై అనవసరంగా ఒత్తిడి పెరుగుతోందని, దీన్ని తీసేస్తే మహిళలతో పాటు కండక్టర్లకు కూడా ఊరట లభిస్తుందని వారు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ నిబంధన లేకపోతే సులువుగా వేగంగా టికెట్లు ఇచ్చేందుకు వీలు కలుగుతుందన్నారు.

దీంతో సీఎం చంద్రబాబు కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కొత్త ఏడాదిలో ఈ గుర్తింపు కార్డుల నిబంధన తొలగించే అవకాశం ఉంది. రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో అమలు చేసి ఇతర ప్రాంతాల్లో ఈ గుర్తింపు కార్డులు చూపించి ప్రయాణాలు చేయాలనే నిబంధన తొలగిస్తారని చెప్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications