అర్ధరాత్రి బుల్లెట్పై టి మంత్రి షికారు!: కెసిఆర్పై ఎర్రబెల్లి
పార్టీ కార్యకర్తల కోరిక మేరకే ఆయన బుల్లెట్ వాహనాన్ని నడిపినట్లు తెలిసింది. ఆయన వెంట పలువురు కార్యకర్తలు కూడా ర్యాలీ మాదిరిగా బయల్దేరారు. తాను నడుపుతున్న బుల్లెట్ వాహనం వెనక ఓ కార్యకర్తను కూర్చోబెట్టుకున్న మంత్రి ఉత్సాహంగా బుల్లెట్ నడిపారు.
తగాద ఎందుకు: ఎర్రబెల్లి
కేంద్రంతో తగాదులు ఎందుకు పెట్టుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి పాలన చేయాలనుకోవడం సరికాదని ఆయన సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేటలో ఎండిపోయిన పంటలను ఎర్రబెల్లి, ఇతర తెలుగుదేశం నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సొంత జిల్లాలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను కూడా రాష్ట్ర మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్.. ఇప్పుడు అనేక కొండీలు చెబుతున్నారని విమర్శించారు.