తండ్రి లాంటి వాడిని: కేసీఆర్, బాబులకు గవర్నర్ నర్సింహన్ కీలక సూచనలు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడులకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ కీలక సూచనలు చేశారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడులకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ కీలక సూచనలు చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లకు తాను తండ్రిలాంటివాడినని అన్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల్లో వేగం మరింత పెరగాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగాల్సిన అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు.

ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ను ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్న సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగు నీటి గొడవను పరిష్కరిస్తానని గవర్నర్ నర్సింహన్ చెప్పారు.
రెండు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. వివాదాస్పదంగా మారిన నాగార్జునసాగర్ గొడవను పరిష్కరిస్తానని గవర్నర్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి అన్ని సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications