మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట - ఎట్టకేలకు షరతులతో బెయిల్...
వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మచిలీపట్నం కోర్టు ఆయనకు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
వైసీపీ నేత, మంత్రి పేర్నినాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఈ కేసులో కొల్లు రవీంద్రకు బెయిల్ ఇవ్వొద్దంటూ పలుమార్లు కోర్టును కోరారు. దీంతో ఇప్పటికే చాలాసార్లు ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది.

ఎట్టకేలకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మచిలీపట్నం కోర్టు మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న కొల్లు రవీంద్రను బెయిల్పై విడుదలయ్యాక 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు షరతు పెట్టింది. పోలీసుల విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని, ఇతర నిబంధనలు కూడా పాటించాలని సూచించింది.
మచిలీపట్నం కోర్టు బెయిల్ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్ అధికారులు కొల్లు రవీంద్రను ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం విడుదల చేయనున్నారు. బెయిల్ షరతుల మేరకు ఆయన విజయవాడ నివాసంలోనే ఉండాల్సి ఉంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications