భూహక్కు చట్టంపై ట్వీట్ సవరించిన జగన్ సీఎంవో మాజీ అధికారి..!
ఏపీలో ఎన్నికల వేళ భూహక్కు చట్టంపై రచ్చ మామూలుగా లేదు. ఈ చట్టానికి మద్దతుగా వైసీపీ, వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న పోరాటంతో ఏకంగా ఎన్నికల అజెండాలే మారిపోతున్నాయి. క్షేత్రస్దాయిలోనూ దీనికి జనం స్పందన వస్తోంది. దీంతో ఇరుపక్షాలూ పోరు ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ వార్ లోకి జగన్ సీఎంవోలో పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ ఒకరు ఇవాళ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఉదయం చేసిన ట్వీట్ కలకలం రేపింది.
భూహక్కు చట్టానికి తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ గతంలో జగన్ సీఎంవోలో కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు. తన తల్లితండ్రుల పట్టా భూముల్ని మ్యుటేషన్ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు ఎలా వ్యవహించారో గుర్తుచేసుకుంటూ తనకే ఇలాంటి పరిస్ధితి ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు!#JaganLandGrabbingAct pic.twitter.com/VwEwqljLBs
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2024
పీవీ రమేశ్ చేసిన ఆ ట్వీట్ లో భూహక్కు చట్టం అమల్లోకి వచ్చేసింది అన్నట్లుగా వ్యాఖ్యలున్నాయి. దీన్ని వెంటనే క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు రీట్వీట్ చేశారు. అంతేకాదు దీనికి కాస్త మసాలా కూడా జోడించి జనం అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగి సోషల్ మీడియాలో కౌంటర్లు వేయడం మొదలుపెట్టాయి. దీంతో పీవీ రమేశ్ తన ట్వీట్ ను సవరించారు.
నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి…
— Dr PV Ramesh (@RameshPV2010) May 6, 2024
తొలుత పెట్టిన ట్వీట్ లో పీవీ రమేశ్.. తన తల్లి తండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అయితే సవరించిన ట్వీట్ లో మాత్రం.. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి అంటూ మ్యాటర్ అప్డేట్ చేశారు. దీంతో ఈ రెండు ట్వీట్లు పోలుస్తూ వైసీపీ సోషల్ మీడియా సైటైర్లు వేస్తోంది.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications