ఘోర ప్రమాదం: కారును డీకొన్న లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో నలుగురికి గాయాలు
తూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రహదారిపై కారును లారీ వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంతో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెనుగుదురు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
Recommended Video
ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గరిటయ్యకాలనీ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను.. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అద్దంకి నుంచి ఇంకొల్లు మండలం కొనంకికి కూలీలు మిరపకాయల కోతకు వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు అద్దంకి మౌలా నగర్కు చెందిన అనసూయమ్మ, షేక్ కరీమూన్గా గుర్తించారు. గాయపడినవారిని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications