కారు దూసుకెళ్లి నలుగురు విద్యార్థుల మృతి
నిడమనూరు ఎస్ఆర్కె ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు జ్యోతిర్మయి, చందుశ్రీ, విజయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని సింధుజ మరణించారు. తీవ్రంగా గాయపడిన సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన పిజి విద్యార్థి డాక్టర్ సురేష్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.
గాయపడినవారిని సమీపంలోని సెంటినీ ఆస్పత్రికి తరలించారు. ఎన్. సుబ్రహ్మణ్యం పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ఎపి 16 బిఎం 2526 నెంబర్ గల కారు ఈ ప్రమాదానికి ఈ ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
రామగుండం ఎన్టీపిసిలో ముగ్గురు మృతి
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టిపిసి నాలుగో యూనిట్లో గురువారంనాడు ప్రమాదం సంభవించింది. యూనిట్లోని ఇనుప స్తంభం కూలి పడింది. ఈ ఘటనలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మరణించారు. మృతులను సుదర్శన్, ముని, పివి రత్నంలుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.