చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారిని లారీ కిందకి తోసేసిన పేరెంట్స్, వరుడు పరార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అనంతపురం పట్టణం కమలానగర్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడి నాలుగేళ్ల చిన్నారిని లారీ కింద పడేయగా బిడ్డ మృతి చెందింది. భార్యాభర్తలు మద్యం మత్తులో చిన్నారిని లారీ కిందకు తోసేశారు.

సొమ్ముతో వరుడు పరార్, వధువు ఆత్మహత్యాయత్నం

 Four year child killed in accident

వరుడు చేసిన నిర్వాకం కారణంగా వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో ఇది జరిగింది. వరుడు రెండు లక్షల రూపాయల కట్నం, మూడున్నర తులాల బంగారంతో ఉడాయించాడు.

దీంతో వధువు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తట్టుకోలేక వధువు ఆత్మహత్యకు ప్రయత్నించింది. వధువు పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

English summary
Four year child killed in accident in Anantapuram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X