నైజీరియా నుండి వచ్చిన వ్యక్తికి ఎబోలా లేదు, డాక్టర్స్ సహా భయపడ్డారు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకమైన వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తికి ఎబోలా లేదని, ఢిల్లీకి పంపిన రక్త పరీక్షల్లో ఎబోలా కాదని నిర్ధారణ అయ్యిందని గాంధీ సూపరింటెండెంట్ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు.
గత నెల 21న నైజీరియా నుంచి ముంబై వచ్చిన అతన్ని విమానాశ్రయంలో థర్మల్ స్కానర్ ద్వారా చెకప్ చెయ్యగా, ఎలాంటి జ్వరంగాని ఇతరత్రా విషయాలుగాని బయట పడకపోవడంతో ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. మూడురోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ గత నెల 24న జ్వరం, వంటినొప్పుల లక్షణాలు కనిపించడంతో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
చికిత్సపొందుతున్న తరుణంలో కడుపు ఉబ్బడం, యూరిన్ రాకపోవడం వంటివి జరగడంతో డాక్టర్లు కేర్ క్లినిక్స్కు పంపించారు. కేర్ క్లినిక్ ఇంఛార్జ్ అతనిలో అరుదైన వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని, తక్షణమే గాంధీ ఆసుపత్రిలో చేరాలని సూచించారు.

సోమవారం సాయంత్రం శ్రీనివాస్ ప్రసాద్కు గాంధీ ఆస్ప్రతి 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్లి రాష్ట్ర ర్యాపిడ్ రెస్క్యూ టీం బృందం డాక్టర్లు వైరాలజీ విభాగం ఇన్చార్జి నర్సింహులు, మైక్రోబయాలజిస్ట్ సత్యమూర్తి, ఎప్డిమాలజిస్ట్ వినోద్ కలసి పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్ వేసుకుని అతనికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.
రోగి రక్తం, సిరా నమూనాలను తీసి ప్రత్యేకమైన ప్యాక్లో రాత్రి 12 గంటల సమయంలో ఎయిర్ కార్గో ద్వారా ఢిల్లీలోని బయోసెఫ్టీవాల్ 3, 4 ల్యాబ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ల్యాబ్ (ఎన్సిడిసి)కి పంపించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రక్త సిరా నమూనాలు ల్యాబ్కు చేరినట్టు సమాచారం వచ్చిందని డాక్టర్లు తెలిపారు.
సాయంత్రం ఆ నమూనాల ప్రకారం రోగికి ఎబోలా వ్యాధి లేదని, నెగటివ్ అని రిజల్ట్ వచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ సెంటర్లో ఇద్దరు సిస్టర్స్ను ఏర్పాటు చేశామని అతని భార్యను కూడా అక్కడే ఉంచామని, వారిని బయటకు పంపించకుండా ఉంచామని గాంధీ సూపరింటెండెంట్ తెలిపారు.
ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నాడని, మాట్లాడుతున్నాడని రాష్ట్ర నోడల్ అధికారులతో ఫోన్లో స్వయంగా మాట్లాడారని డాక్టర్లు చెప్పారు. శ్రీనివాస్ ప్రసాద్కు ఎబోలా లక్షణాలు కనిపించడం లేదని, కాని మరో ప్రత్యేకమైన వైరస్ సోకిందని భావిస్తున్నట్లు తెలిపారు.
నైజీరియాను అక్టోబర్ 19న ఎబోలా ఫ్రీ దేశంగా ప్రకటించారని, ఇతను నవంబర్ 21న వచ్చారని, ఎయిర్కార్గోలో వచ్చేటప్పుడు ఇతర దేశాలు వారు ఉండటం వల్ల రావచ్చని డాక్టర్లు అంటున్నారు.
ఇదిలా ఉండగా, రిపోర్ట్ రాకముందు గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వైరస్ సోకిందని భావించిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడనే విషయం తెలుసుకున్న ప్రజలు, రోగులు, డాక్టర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వైద్యులు సైతం భయాందోళన చెందుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయంశంగా మారింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications