చంద్రబాబు, లోకేష్ అండతోనే అరాచకాలు: కాల్ మనీపై గంగా భవానీ
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం సభ్య సమాజం తల దించుకునేలా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి గంగా భవానీ అన్నారు. బుధవారంనాడు ఆమె హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కాల్ మనీ వ్యవహారంపై ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
మహిళలను ఆదుకుంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్న దోషులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆమె అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లనే కాల్ మనీ ఆగడాలు పెరిగాయని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అండతోనే తెలుగుదేశం పార్టీ నేతలు కాల్ మనీ అరాచకాలకు పాల్పడుతున్నారని గంగా భవానీ వ్యాఖ్యానించారు నిజాయితీగా వ్యవహరిస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ను ఈ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేసిందని ఆమె విమర్శించారు.

కాల్ మనీపై ఇంత వివాదం జరుగుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గానీ, మంత్రులు గానీ ఖండించకపోవడం బాధ్యతారాహిత్యమని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలి సభ్యుడు సీ రామచంద్రయ్య బుధవారం లేఖ రాశారు. నవ్యాంధ్ర రాజధాని భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ను శాసన సభలో, మండలిలో ప్రవేశ పెట్టాలని అందులో కోరారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications