అందుకే వచ్చా: డిగ్గీ హామీ, టి నేతల విందు(పిక్చర్స్)
హైదరాబాద్: 'గో ఎ హెడ్' అని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. లేక్ వ్యూ అతిథి గృహంలో ఉన్న డిగ్గీని తెలంగాణ నేతలు వరుసగా కలుస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు కలిశారు.
ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో, పార్లమెంటులో త్వరగా తెలంగాణ బిల్లును పెట్టించాలని కోరారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా చూడాలని కోరారు. దీనికి ఆయన వారితో గో ఎ హెడ్ అంటూ చెప్పారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే విషయమై చెప్పనప్పికీ తెలంగాణ ఏర్పాటు త్వరలో ఖాయమని అర్థం ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించిందంటున్నారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకే తాను హైదరాబాదుకు వచ్చానని, ఊరూరా కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనతను చాటాలని టి కాంగ్రెసు నేతలకు డిగ్గీ సూచించారు. దిగ్విజయ్ సాయంత్రం పిసిసి కార్యవర్గంతో భేటీ అవుతారు. రాత్రి గవర్నర్ నరసింహన్ను కలుస్తారు. స్పీకర్తో ఫోన్లో మాట్లాడే అవకాశముంది. డిగ్గీతో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు.
తెలంగాణ 1
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. హాజరైన దామోదర, జానా రెడ్డి.
తెలంగాణ 2
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. హాజరైన డిఎస్ తదితరులు.
తెలంగాణ 3
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. దామోదరతో జానా ముచ్చట్లు, పక్కన బస్వరాజు, గండ్రలు.
తెలంగాణ 4
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. భోజనం చేస్తున్న నేతలు.
తెలంగాణ 5
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. భోజనం చేస్తున్న డికె అరుణ, డిఎస్, పొన్నాల తదితరులు.
తెలంగాణ 6
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమై ముచ్చటిస్తున్న దృశ్యం.
తెలంగాణ 7
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమై ముచ్చటిస్తున్న దృశ్యం. భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు.
తెలంగాణ 8
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. పొన్నాలతో డికె అరుణ, గీతారెడ్డి ముచ్చట
తెలంగాణ 9
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న గండ్ర, డికె అరుణ.
తెలంగాణ 10
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తదితరులు భేటీ అయిన దృశ్యం.