ఏపీకి మెగా పుడ్ పార్కు: మోడీని అలా కలిశాడు, ఇలా ప్రాజెక్టు వచ్చింది
అమరావతి: సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో రెండు మెగా పుడ్ పార్క్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు కేంద్రం అంగీకరించింది. భారత ఆహార రంగంలో ఎగుమతి, దిగుమతి వాణిజ్య రంగాన్ని మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ పార్కులను చేపట్టనున్నట్టు నౌకాయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
"నౌకాయాన శాఖ చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద దేశంలో రెండు మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. సముద్ర తీరాలకు దగ్గరగా ఉన్న సెజ్లలో ఇవి ఉంటాయి. ఒకటి ఏపీలోని కాకినాడ ప్రాంతంలో ఇది ఏర్పాటవుతుండగా, రెండోది మహారాష్ట్రలో దక్షిణాన కొంకణ్ రీజియన్లో సతారా మెగా ఫుడ్ పార్క్ పేరిట ఏర్పాటు చేస్తున్నాం" అని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.

వైశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఏర్పాటవుతున్న ఈ మెగా ఫుడ్ పార్క్ నుంచి కాకినాడ ఓడరేవు ద్వారా విదేశాలకు ఎగుమతులు చేసే ఆలోచనలో ఉన్నామని అందులో పేర్కొంది. ఏపీలో నిర్మంచతలపెట్టిన ఈ పుడ్ ప్రాజెక్టుకు రూ. 184.88 కోట్లు వ్యయమవుతాయన్న అంచనాలు వేసింది.
ఇక మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలోని మార్ముగావ్ పోర్టులో నిర్మించతలపెట్టిన ఈ పుడ్ ప్రాజెక్టుకు 139.33 కోట్లు కేటాయించామని, వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని పేర్కొంది. భారత్లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు గణనీయంగా పెరుగుతున్న వేళ, ఈ రెండు ప్రాజెక్టులూ ప్రజల అవసరాలను తీర్చేందుకు దోహదపడనుంది.
దీంతో పాటు ఈ పుడ్ ప్రాజెక్టులు ద్వారా భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. దేశంలోని వివిధ పోర్టులను పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దడం వల్ల ఆహార రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని కేంద్రం భావిస్తోంది.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
ట్రాన్స్జెండర్తో మంత్రి రాసలీలలు.. వైరల్ వీడియో -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications