దేవుడికీ తప్పని పన్ను పోటు: ఏపీలో జీఎస్టీ పరిధిలోకి 179 ఆలయాలు..
జీఎస్టీ ఎఫెక్ట్ అటు దేవాలయాలపై కూడా పడింది.రూ.20లక్షల ఆదాయాన్ని మించిన దేవాలయాలను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఆలయ ఈవోలకు వాణిజ్య పన్నుల అధికారులే లేఖలు కూడా రాశారు.
విజయవాడ: శుక్రవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న పన్నుల స్థానంలో కేంద్రం నిర్ణయించిన నాలుగు శ్లాబుల పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ ఎఫెక్ట్ అటు దేవాలయాలపై కూడా పడింది.
రూ.20లక్షల ఆదాయాన్ని మించిన దేవాలయాలను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఆలయ ఈవోలకు వాణిజ్య పన్నుల అధికారులే లేఖలు కూడా రాశారు. దీంతో ఏపీలోని మొత్తం 23,834 ఆలయాల్లో 179ఆలయాలు జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. వీటిలో రూ.25లక్షల ఆదాయాన్ని మించిన ఆలయాలు 7 ఉండటం గమనార్హం.

దేవాలయాల ఆదాయాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం.. ప్రసాదంపై మాత్రం అందుకు మినహాయింపు ఇచ్చింది. అయితే ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, జీడిపపప్పుపై మాత్రం పన్ను బాదుడు తప్పలేదు. దేవాలయాల్లో వినియోగించే అగరబత్తులు, అద్దెగదులు, వివిధ సేవల టికెట్లు, హుండీలు, తలనీలాలు, తదితరాలపై జీఎస్టీ అమలవనుంది.
అయితే ఒక్క తిరుపతి పుణ్యక్షేత్రంలో మాత్రం తలనీలాలపై జీఎస్టీకి మినహాయింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications