పుత్రుడి నిర్వాకం: మంత్రి రావెలకు గుంటూరు మహిళల సెగ
గుంటూరు/ హైదరాబాద్: ఓ మహిళా టీచర్ పట్ల హైదరాబాదులో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్కు వ్యతిరేకంగా గుంటూరులో శనివారంనాడు మహిళలు ఆందోళనకు దిగారు. మంత్రి కుమారుడు సుశీల్ను అరెస్టు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.
మంత్రి కొడుకైతే అతనికి కొమ్ములుంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అంటూ మహిళలు నినాదాలు చేశారు. మైనారిటీ సంఘాల నాయకులు ఆ నినాదాలతో రాస్తారోకోకు దిగారు. పత్తిపాడులోని ఓల్డ్ మద్రాసు రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

రావెల సుశీల్ ఉదంతంపై తెలంగాణ మైనారిటీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వారిని వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనారిటీ కమిషన్ చైర్మన్ కోరారు. కాగా, కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హైదరాబాదు బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మి కోరారు.
బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసేంత వరకు ఊరుకునేది లేదని ఆమె అన్నారు. కాగా, సుశీల్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications