జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరికి చంద్రబాబు ఆహ్వానం..
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే జరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలకు నందమూరి కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబ సభ్యులందరికీ టీడీపీ అధిష్టానం ఆహ్వానాలు పంపుతోంది. అయితే ఇది పార్టీ తరఫున కాకుండా ఎన్టీఆర్ శతజయంతి కోసం ఏర్పాటు చేసిన కమిటీ తరఫున ఈ ఆహ్వానాలు అందుతున్నాయి.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణ కోసం టీడీపీ అధిష్టానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టీడీపీలో చంద్రబాబు ఆత్మగా పిలుచుకునే మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ను ఛైర్మన్ గా పెట్టారు. ఆయన ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఇవాళ ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఇంటికెళ్లి మరీ ఆహ్వాన పత్రిక అందజేశారు. విజయవాడలో జరిగిన వేడుకలకు జూనియర్ ను ఆహ్వనించకపోవడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది.

అలాగే ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరిని సైతం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమెకు కూడా ఇంటికి వెళ్లి టీడీ జనార్ధన్ ఆహ్వాన పత్రిక అందజేశారు. దీంతో పురంధేశ్వరి కూడా హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులకు కూడా ఈ ఆహ్వానాలు అందబోతున్నాయి. దీంతో హైదరాబాద్ సభకు నారా, నందమూరి కుటుంబాలు కలిసి హాజరుకానున్నారు.
నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ మే 20 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, కూకట్పల్లి, హౌసింగ్ బోర్డులోగల కైతలాపూర్ మైదానంలో ఎన్టీఆర్పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్, 'జయహో ఎన్టీఆర్' వెబ్సైట్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎన్.టి.రామారావు గారి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఇందులో ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ గార్ల సహకారంతో ఈ రోజు కమిటీ చైర్మన్ టి.డి.జనార్థన్ , డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందీశ్వరి, జూనియర్ ఎన్టీఆర్ , నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణ , గారపాటి లోకేశ్వరి, కంఠంనేని ఉమాశ్రీనివాస్ ప్రసాద్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, నందమూరి కళ్యాణ్రామ్ , కాట్రగడ్డ రుక్మాంగదరావు (ఎన్టీఆర్ బావమరిది), ఇతర ఇతర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వాన పత్రాలు అందించారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications