శ్రీకాకుళంతో పాటు ఆ జిల్లావాసులు ఉబ్బితబ్బిబ్బయ్యే వార్త.. ఆ అమృత్ భారత్ రైళ్ళ హాల్టింగ్!
భారతీయ రైల్వే తన రవాణా సౌకర్యాలను మెరుగు పరుచుకుంటూ తన ప్రస్తానాన్ని సాగిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం మాత్రమే, శరవేగంగా అనేక కొత్త లైన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో పలు ప్రాంతాలకు ప్రజలు డిమాండ్ మేరకు కొన్ని రైళ్లను హాల్టింగ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాలలో అందరికీ మెరుగైన రైలు రవాణాను అందిస్తోంది.
పెందుర్తిలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్
తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏపీ వాసులకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు రైళ్లకు కొత్త హాల్టింగ్ స్టేషన్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా బాలూర్ ఘాట్ నుంచి ఎస్ ఎన్ విటి బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పెందుర్తిలో హాల్టింగ్ స్టాప్ ను కేటాయించింది.

బారువా రైల్వేస్టేషన్లో ఆ రైలుకు హాల్టింగ్
జనవరి 17వ తేదీన బాలూర్ ఘాట్లో ప్రారంభమై ఈ రైలు ఆదివారం నాడు పెందుర్తి రెండో ప్లాట్ఫాం పైన పది నిమిషాల పాటు నిలిచింది. ఈ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పర్యవేక్షించారు. మరోవైపు భువనేశ్వర్ విశాఖపట్నం ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బారువా రైల్వేస్టేషన్లో హాల్టింగ్ పాయింట్ మంజూరు అయింది. ఇక దీనిని ఆదివారం నాడు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ జెండా ఊపి ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆ మార్గంలో కొత్త రైల్వే హాల్టింగ్ పాయింట్ లు
సోంపేట ప్రాంత 23గ్రామాలు ప్రజలు ఈ రైలు హాల్టింగ్ స్టాప్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంక్రాంతికి వచ్చిన చాలామంది తమకు సౌకర్యవంతంగా రైలు సమీపంలో ఉన్న స్టేషన్లో ఆగడంతో ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. రైలు గంటన్నర ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా జలుమూరులో తిలారు రైల్వేస్టేషన్లో బ్రహ్మపుత్ర విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కొత్త స్టాప్ లభించింది.
ఇచ్చాపురం, కంచిలి రైల్వే స్టేషన్ లలోనూ స్టాప్ లు
అదేవిధంగా ఇచ్చాపురం, కంచిలి రైల్వే స్టేషన్లలోనూ కొన్ని రైళ్లకు స్టాప్స్ లభించాయి. ఇచ్చాపురంలో మూడు వీక్లీ రైళ్ళు ఇకనుండి హాల్ట్ అవుతాయి. పూరి- అహ్మదాబాద్, రాధిక పూర్- smvt బెంగళూరు, రంగాపాణి- నాగర్ కోయిల్, న్యూజల్ పాయి గురి- తిరుచినాపల్లి స్పెషల్ అమృత్ భారత్ రైళ్లు ఆదివారం నుండి ఆగుతాయి. దీంతో ఇక్కడ కూడా ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
అమృత్ భారత్ రైలుకు దూర ప్రయాణాలు సులభతరం
ఈ రైల్వే స్టేషన్ల హాల్టింగ్ వల్ల ప్రయాణికులకు సౌకర్యం మెరుగవుతుంది. ముఖ్యంగా అమృత్ భారత్ రైలు దూర ప్రయాణాలను సులభతరం చేస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఈ రైళ్లను శ్రీకాకుళం జిల్లాలలో హాల్టింగ్ చేయడంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కందాళం అశోక్ పాత్రను ప్రజలు కొనియాడుతున్నారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా!












Click it and Unblock the Notifications