జగన్ పిటిషన్పై విచారణ వాయిదా, 4న గుంటూరు
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. జగన్ పిటిషన్పై సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో రైతుల సమావేశాన్ని, ట్రాక్టర్ల ర్యాలీని అక్టోబర్ 1వ తేదీన గుంటూరులో తలపెట్టారు. బెయిల్పై విడుదల కావడంతో ట్రాక్టర్ల ర్యాలీకి తానే నేతృత్వం వహించాలని జగన్ భావిస్తున్నారు. అయితే, ఆ ర్యాలీని 4వ తేదీకి వాయిదా వేయాలని అనుకుంటున్నారు.
అక్టోబర్ 1,2 తేదీల్లో జగన్ ఇడుపులపాయకు వెళ్లాలని అనుకుంటున్నారు. 3వ తేదీన ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీంతో ర్యాలీని 4వ తేదీన నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలని కూడా జగన్ కోర్టును కోరారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలావుంటే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కేసులో ప్రధాన నిందితుడు వైయస్ జగన్కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విజయసాయిరెడ్డి కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు.