భగ్గుమంటున్న ఏపీ జిల్లాలు- 40 డిగ్రీలకు పైగా

Temperature in AP: ఏపీలో ఎండ తీవ్రత అధికమౌతోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి.

ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. శనివారం బాపట్ల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని రావిపాడులో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నంద్యాల, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 ప్రాంతాల్లో ఎండ తీవ్రత 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

heatwave-alert-several-districts-in-andhra-pradesh-records-highest-temperature

నేడు కూడా అదే తీవ్రత కొనసాగుతుందని ఎస్డీఎంఏ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత రికార్డవుతుందని పేర్కొంది. మే నాటికి ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు వెళ్ల అవకాశాలు ఉన్నాయి. వేడిగాలులు సైతం వీస్తోండటం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వేర్వేరు జిల్లాల్లో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 68 మండలాల్లో వడగాలులు వీచినట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాలుల తీవ్రత నేడు కూడా కొనసాగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు.

నేడు వడగాలుల తీవ్రత అత్యధికంగా ఉండే జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం- 11, పార్వతీపురం మన్యం- 10, శ్రీకాకుళం- 7 మండలాల్లో వీటి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+