ఏపీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు- కేవలం 7943-100లోపే మరణాలు
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని వారాలుగా పగటి పూట కర్ఫ్యూ అమల్లో ఉండటంతో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. మరణాలు కూడా క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 7943 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరణాలు కూడా వందలోపే నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 83461 టెస్టులు నిర్వహించగా. ఇందులో 7943 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య గమనిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1877 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత చిత్తూరులో 1283 మంది పాజిటివ్గా తేలారు. మిగతా జిల్లాల్లో వెయ్యికి లోపే కేసులు నమోదయ్యాయి. గుంటూరు 765, విశాఖ 551, అనంతపురం 544, కర్నూలు 499, పశ్చిమగోదావరి 461, కడప 447, నెల్లూరు 378, ప్రకాశం 345, కృష్ణా 291, విజయనగరం 271, శ్రీకాకుళం 231 కేసులు నమోదయ్యాయి.
వీటితో కలుపుతుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో 16.93 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 15.28 లక్షల మంది కోలుకున్నారు. మరో 1.53 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 98 మంది చనిపోయారు. వీరిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15, పశ్చిమ గోదావరిలో 12, ప్రకాశంలో 10, అనంతపూర్లో 9, తీర్పుగోదావరిలో 8 మరణాలు నమోదయ్యాయి. అలాగే విశాఖలో 8, శ్రీకాకుళంలో 7, కృష్ణాలో 6, కర్నూల్లో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, కడపలో ముగ్గురు చనిపోయారు. వీటితో కలుపుకుంటే రాష్టంలో ఇప్పటివరకూ 10930 మంది కరోనాతో చనిపోయారు.
Recommended Video