ట్రయాంగిల్ లవ్: ప్రేమించి పెళ్ళి,ట్విస్టిచ్చిన భార్య, 3 నెలలకే భర్త సూసైడ్
కర్నూల్:ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. కానీ, ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో ఉంది. కానీ మరో యువకుడితో వివాహం చేసుకొంది. వివాహం చేసుకొన్నా భర్తతో కాపురం చేయలేదు. విడాకులు కావాలని భర్తతో గొడవకు దిగేది. ఈ కారణంగానే పెళ్ళైన మూడు మాసాలకే వినయ్కుమార్ రైలు కింద పడి ఆత్మహత్మకు పాల్పడిన ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.ఈ ఘటనతో మృతుడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు మృతికి కోడలు, ఆమె కుటుంబసభ్యులే కారణమని వారు ఆరోపిస్తున్నారు.
కర్నూల్ పట్టణానికి సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద రైలు కింద పడి 24 ఏళ్ళ యువకుడు వినయ్కుమార్ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .అతడికి వివాహమై అప్పటికి మూడు మాసాలు మాత్రమే అవుతోంది.
భార్య, భర్తల మధ్య విభేధాల కారణంగానే పెళ్ళి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రేమించి పెళ్ళి చేసుకొన్న తర్వాత కోడలు తన కొడుకును విడాకులు ఇవ్వాలని ఇబ్బంది పెట్టడంతోనే తమ కొడుకు ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

పెళ్లైన మూడు మాసాలకే పెళ్ళి కొడుకు ఆత్మహత్య
కర్నూల్ జిల్లా గోనెగండ్లకు చెందిన యువకుడు వినయ్కుమార్ ఎంబీఏ చదువుకొన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం రాకపోవడంతో పత్తికొండలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. వెల్ధూర్తికి చెందిన సౌజన్యను వినయ్కుమార్ ప్రేమించి 2017 నవంబర్ 1వ, తేదిన వివాహం చేసుకొన్నాడు. కానీ, అప్పటికే ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో ఉంది.

భర్తతో రోజూ గొడవలు
వేరే యువకుడితో ప్రేమలో ఉన్న కారణంగా పెళ్ళైన నాటి నుండి సౌజన్య భర్త వినయ్కుమార్ను విడాకులు ఇవ్వాలని గొడవకు దిగింది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. 20 రోజుల క్రితం సౌజన్య పుట్టింటికి వెళ్ళింది. ఫిబ్రవరి 12వ, తేదిన భార్యకు ఆరోగ్యం బాగా లేదని ఆమె కుటుంబసభ్యులు వినయ్కుమార్ కు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి ఆసుపత్రిలో సౌజన్యను యోగక్షేమాలు కనుకొన్నాడు.

ఆసుపత్రిలో భార్యభర్తల మధ్య గొడవ
కర్నూల్లో ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్య సౌజన్యతో మాట్లాడిన తర్వాత విడాకుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు మృతుడి సోదరుడు వంశీ చెబుతున్నారు. ఆసుపత్రిలో చెకప్ పూర్తైన తర్వాత సౌజన్య తన తల్లితో కలిసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పెళ్ళై మూడు మాసాలు కాలేదు, భార్య విడాకులు కోరడమే కాకుండా గొడవకు దిగడంతో వినయ్కుమార్ మనోవేదనకు గురయ్యాడు.

రైలు కిందపడి ఆత్మహత్య
తల్లితో కలిసి భార్య పుట్టింటికి వెళ్ళడంతో వినయ్ కుమార్ మనోవేదనకు గురయ్యాడు. చిన్న పనుందని తమ్ముడికి చెప్పి కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి జేబులో లభించిన సమాచారం మేరకు పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.తన కొడుకు మృతికి కోడలే కారణమని వినయ్కుమార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications