ఏ పార్టీలో చేరను, రాజకీయాల్లోకి రాను: లక్ష్మీనారాయణ

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రచారం జరుగుతోందని, అదంతా మీడియా కల్పితాలే అన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.
కాగా, ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల వంటి పలు అనేక సంచలనాత్మక కేసులను దర్యాప్తు చేసిన లక్ష్మీనారాయణకు భారతీయ జనతా పార్టీ నుండి పిలుపు వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానించగా, ప్రస్తుతం బిజెపి నాయకులు ఆయనకు గాలం వేసినట్లు ప్రచారం జరిగింది.
మహారాష్ట్ర కేడర్కు చెందిన లక్ష్మీనారాయణ డిప్యుటేషన్లో భాగంగా సిబిఐ జెడిగా ఆంధ్రప్రదేశ్లో పని చేశారు. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత సుమారు తొమ్మిది నెలలపాటు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయనను థానే జాయింట్ కమిషనర్గా నియమించింది.
లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లో వివిద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయనను సంప్రదించి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం బిజెపిలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications