కొడాలి నానిపై పోటీ చేస్తానంటూ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి చెప్పారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఫ్రైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోటీ చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. రెండు చోట్ల నుంచి, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఖమ్మంతోపాటు గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ రేణుకా చౌదరి
వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి చెప్పారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. అయితే, గుడివాడ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పోటీ నెలకొంటే మాటల తూటాలు పేలే అవకాశం లేకపోలేదు.

గుడివాడ నుంచి పోటీ చేయాలంటూ రేణుకా చౌదరిపై ఒత్తిడి!
మొన్నటి వరకూ ఉమ్మడి రాష్ట్రమే కదా.. ఏపీలో పోటీ చేస్తే తప్పేంటి అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఏపీలోనూ పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని అందుకే గుడివాడ స్థానం నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. రెండు చోట్ల పోటీ చేయడంపై తాను సీరియస్ ఉన్నట్లు చెప్పారు.
ఇక ఖమ్మం ఎంపీ విషయంలో పార్లమెంటు ఎన్నికప్పుడు ఆలోచిస్తానని అన్నారు.

పొంగులేటిపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే తోపాటు హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటానని.. ఖమ్మంకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించి భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామని రేణుకా చౌదరి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని రేణుకా చౌదరి సవాల్ విసిరారు. ఇక, మాజీ ఎంసీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామంటూనే.. ఎక్కడా దిక్కులేని వారికి కాంగ్రెస్ దిక్కంటూ చురకలంటించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సీబీఐ విచారణను స్వాగతించిన రేణుక
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ విచారణ మంచిదేనని రేణుకా చౌదరి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలు చూసి సిగ్గు పడుతున్నానని అన్నారు. ఇంఛార్జీ వచ్చి సెట్ చేయాల్సిన పరిస్థితి రావడం విచారకరమని వ్యాఖ్యానించారు. రేవంత్ పాదయాత్రలో తాను పాల్గొంటానని చెప్పారు. కాగా, రేవంత్ హాథ్ సే హాత్ జోడో యాత్రను టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మార్పు కోసం తాను ఈ యాత్ర చేపట్టినట్లు రేవంత్ వ్యాఖ్యానించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications