అతలాకుతలం, అత్యంత భారీ వర్షాలు - తాజా హెచ్చరికలు.!!
ఆకాశానికి చిల్లు పడిండా అన్నట్లు వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో గంట వ్యవధిలోనే 5 నుంచి 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులకు వరదలు వచ్చి నదులుగా మారుతున్నాయి. అతి భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో బీభత్సమే మిగిలింది. పలు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
అతి భారీ వర్షాలు :తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో అతి భారీ వర్షం పైన అధికారులు అప్రమత్తం చేసారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. జూన్ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే దాదాపు 33 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైందని, మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
మూడు రోజుల పాటు:మరో మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి రుతుపవన ద్రోణి బుధవారం తోడైంది. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.
మత్స్యకారులెవ్వరూ చేపలవేటకు వెళ్లదని హెచ్చరించింది. 27న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరో రెండు రోజులు వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాత భవంతులను వీడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించింది.
పాఠశాలలకు సెలవులు:ఏపీలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ గా ప్రకటించారు. రానున్న 48 గంటల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేశారు. ఏపీలోని మిగిలిన జిల్లాలో రానున్న రెండు రోజులు మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. క్రిష్ణా, గోదావరి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి జిల్లా యంత్రాంగం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. గోదావరి వరద భద్రాచలంను వణికిస్తోంది. గంట గంటకు వరద తీవ్రత పెరుగుతోంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. జలాశయాల వద్ద అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications