Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాతీయ జెండా వెనుక ఇంత పెద్ద కథ ఉందా..!

ప్రతీ దేశానికి ఓ జాతీయ జెండా ఉంది. అలాగే భారతదేశానికి సైతం జాతీయ జెండా ఉంది. మన దేశపు జెండాకు రూపకర్త పింగళి వెంకయ్య అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ జెండా వెనుక కథ మాత్రం చాలామందికి తెలియదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పింగళి వెంకయ్య రూపుదిద్దిన జాతీయ జెండా వెనక ఉన్న కథను తెలుసుకునే ప్రయత్నాం చేద్దాం.

పింగళి వెంకయ్య భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు మాత్రమే కాకుండా, మన దేశ జాతీయ జెండాను రూపొందించిన ఘనత కలిగిన వ్యక్తి. ఆయన 2 ఆగస్టు 1876లో ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో, వెంకయ్య బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు.

independence special story on pingali venkayya

రెండవ బోయర్ యుద్ధం (1899-1902) సమయంలో దక్షిణాఫ్రికాకు వెళ్లి మరి యుద్దం చేశారాయాన. యుద్ధ సమయంలో బ్రిటన్ జాతీయ జెండా అయిన యూనియన్ జాక్‌కు సైనికులు సెల్యూట్ చేయవలసి వచ్చినప్పుడు , భారతీయులకు జెండా ఉండవలసిన అవసరాన్ని వెంకయ్య గ్రహించారు.

1906లో కలకత్తాలో జరిగిన AICC సెషన్‌కు వెంకయ్య హాజరైనప్పుడు , కాంగ్రెస్ సమావేశాలలో బ్రిటిష్ జెండాను ఎగురవేయాలనే ఆలోచనను వ్యతిరేకించినందున భారత జాతీయ కాంగ్రెస్ కోసం జెండాను రూపొందించడానికి వెంకయ్య ప్రేరణ పొందారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా, స్వతంత్ర భారతదేశానికి ఒక ప్రతీకగా నిలిచింది. అయితే, తొలి రూపంలో నుండి ఈ జెండా కొన్ని మార్పులకు గురైంది. ఆ మార్పుల గురించి తెలుసుకుందాం.

తొలి రూపం
1921: పింగళి వెంకయ్య గారు మొదట రూపొందించిన జెండాలో ఎరుపు, పచ్చ రంగులు ఉండేవి. మధ్యలో చరఖాను ఉంచారు. ఈ రంగులు హిందువులు, ముస్లింలను సూచించేవి.
గాంధీజీ సూచన: గాంధీజీ ఈ రూపకల్పనను చూసి ముగ్ధుడై, దీనికి తెల్లని రంగును కూడా చేర్చాలని సూచించారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆమోదం: 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఈ జెండాను ఆమోదించారు.

మార్పులు:

1931: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ జెండాలో కొన్ని మార్పులు చేసింది. ఎరుపు రంగు స్థానంలో కాషాయం వచ్చింది. రంగుల క్రమం కాషాయం, తెలుపు, పచ్చగా మారింది.

1947: స్వాతంత్రం సిద్ధించిన తర్వాత బాబూ రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ చరఖా స్థానంలో అశోక చక్రాన్ని ఆమోదించింది.

జాతీయ జెండా ప్రత్యేకతలు
కాషాయం: సాహసం, త్యాగం, నిస్వార్థాన్ని సూచిస్తుంది.
తెలుపు: శాంతి, నిజాయితీ, పవిత్రతను సూచిస్తుంది.
పచ్చ: విశ్వాసం, ఉత్సాహం, సమృద్ధిని సూచిస్తుంది.
అశోక చక్రం: జీవితం, చక్రం కదలికను సూచిస్తుంది.

ముఖ్య విషయాలు:
పింగళి వెంకయ్య భారత జాతీయ జెండాకు పితామహులుగా పరిగణించబడతారు.ఆయన రూపొందించిన జెండా భారతదేశానికి ఒక ప్రతీకగా నిలిచింది.ఈ జెండాలోని మార్పులు భారతదేశ చరిత్రను ప్రతిబింబిస్తాయి. పింగళి వెంకయ్య జయంతిని ప్రతి సంవత్సరం ఆగస్టు 2న జరుపుకుంటారు.ఆయన రచించిన 'ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా' అనే పుస్తకం జాతీయ జెండా గురించి వివరణాత్మకంగా తెలియజేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+