వనజాక్షి మీద దాడిపై విచారణ: ఉద్రిక్తత, గుమ్మడికాయంతలో ఆవగింజ లోపం: నన్నపనేని
విజయవాడ: కొద్ది నెలల క్రితం తహసీల్దార్ వనజాక్షి పైన దాడి కేసు, విచారణ నేపథ్యంలో తమ్మిలేరు వద్ద గురువారం నాడు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వనజాక్షి పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేసినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
వనజాక్షి పైన దాడి ఘటనను విచారించేందుకు శర్మ వచ్చారు. విచారణ నేపథ్యంలో తమ్మిలేరు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించింది. దీంతో విచారణను సబ్ కలెక్టరేట్ ఆఫీసుకు మార్చారు.
గుమ్మడికాయంత అభివృద్ధిలో ఆవగింజంత లోపం సహజం: నన్నపనేని
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుమ్మడికాయంత అభివృద్ధిలో ఆవగింజంత లోపాలు సహజమేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల పట్టిసీమ ప్రాజెక్టుకు గండి, తదితర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దీక్ష చేసేందుకు శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ప్రతి దానికి విమర్శించడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందని మండిపడ్డారు.
దీక్షపై తగ్గని జగన్
ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టే తీరతానని జగన్ ప్రకటించారు. గుంటూరులో ఎంపిక చేసిన దీక్షా స్థలిని మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ప్రకటన చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు గుంటూరు ఎస్పీ అనుమతి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన దీక్షకు అడ్డు చెబుతోందని భావిస్తుని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. దీక్షా స్థలి మార్పు విషయంలో వెనుకడుగు వేసేది లేదని చెబుతున్నారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతివ్వడం లేదని ప్రభుత్వం చెబుతోంది. మరోచోట దీక్ష చేసుకోవచ్చునని చెబుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications