Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"హరిహర వీరమల్లు" విడుదల కాకుండా ఒత్తిడి.. సినిమా హాళ్ల బంద్..?

జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని, తక్షణమే విచారణ చేపట్టాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వివాదం వెనుక "హరిహర వీరమల్లు" సినిమా విడుదలకు ముందు థియేటర్లను మూసివేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు రావడంతో ఇది మరింత తీవ్రమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఈ పరిణామం ఆందోళనకు గురిచేస్తోంది.

Investigation into exhibitors decision to close cinema halls

ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి దుర్గేష్, కేవలం థియేటర్ల మూసివేత నిర్ణయం గురించే కాకుండా, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక 'కార్టెల్'గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపైనా విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ కార్టెల్ ఏ మేరకు సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తోంది, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందా అనే కోణంలోనూ దర్యాప్తు జరగనుంది.

ఈ థియేటర్ల మూసివేత వల్ల ఎన్ని సినిమాలు ప్రభావితమవుతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూ నష్టం వాటిల్లుతుంది అనే అంశాలపై కూడా సమగ్ర వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. సినీ పరిశ్రమకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని, ఈ విషయంలో పూర్తి పారదర్శకతను నెలకొల్పుతామని శ్రీ కందుల దుర్గేష్ తేల్చిచెప్పారు. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యక్తులు త్వరలోనే వెలుగులోకి వస్తారని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+