కాలుపై కాలేసుకున్న వనజాక్షి!, బాబు ఏమైనా పెదరాయుడా: చెవిరెడ్డి
చిత్తూరు/విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి టీడీపీ చీఫ్ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను గౌరవించలేదని, రేవు వద్దకు వెళ్లినప్పుడు కాలుమీద కాలు వేసుకొని ఆమె కూర్చొని సమాధానం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ విప్ను రౌడీ, గూండా అనే అధికారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఎక్కడిదన్నారు. ఘర్షణతో తమకు సంబంధం లేకున్నా వనజాక్షి కన్నీరు పెట్టుకొన్న ఘటనలో చింతమనేని చింతించారన్నారు. సీఎం చంద్రబాబు తన ఇంటిలో ప్రభాకర్కు, ఉద్యోగ సంఘాలకూ రాజీ కుదిర్చాక వీరు ఇటువంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.
చంద్రబాబు పెదరాయుడా?: చెవిరెడ్డి

తగువులు పరిష్కరించేందుకు చంద్రబాబు ఏమైనా పెదరాయుడా అని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పరిష్కారం చేస్తే న్యాయస్థానాలు ఎందుకన్నారు. చంద్రబాబు తన నీడను తానే నమ్మడని, అందుకే కోట్లాది రూపాయలతో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేస్తున్నారన్నారు.
ఏపీ ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు రూ.1650 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అందులో వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. పుష్కరాల సొమ్మును కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంపాదనకు ఆదాయమార్గంగా ఉపయోగించుకుంటున్నారన్నారు. దీనిపై విచారణ జరిపించాలన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications