కేసీఆర్కు బీజేపీ గెలుపు భయం! జీహెచ్ఎంసీ అంత ఈజీ కాదా?
హైదరాబాద్: హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. ఇది తెరాసలో ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.
హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి రామచంద్ర రావు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. వరంగల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టంతో రెండో ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కారు. టీడీపీతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతోంది.
ఇది తెరాసకు వణుకు పుట్టించే అంశమే అంటున్నారు. వామపక్ష నేతలు కూడా ఇటీవల మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, మతతత్వ బీజేపీని వామపక్షాలు మాత్రమే ఎదుర్కోగలవని చెప్పారు. మజ్లిస్ పార్టీ కూడా రాష్ట్ర విభజనకు ముందే బీజేపీ బలపడుతుందని జోస్యం చెప్పింది.

తాజా పరిస్థితులను చూస్తుంటే బీజేపీ క్రమంగా ఎదుగుతోందని అర్థమవుతోందని అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీజేపీ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీజేపీ పుంజుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఉద్యోగాల విషయంలో తెరాస ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్లుగా కనిపించకపోవడంతో నిరుద్యోగులు, చదువుకున్న వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడంతో తెరాసకు జీహెచ్ఎంసీ బెంగ పట్టుకుందనే వారు లేకపోలేదు. సాధారణంగానే రాజధాని ప్రాంతంలో టీడీపీ - బీజేపీ కూటమికి బలం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ కూటమి 15 సీట్లు గెలవడమే అందుకు నిదర్శనం.
ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా బీజేపీయే గెలవడం చూస్తుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలుపు అంత సులభం కాదనేందుకు సంకేతాలు అంటున్నారు. అందుకు తోడు కేసీఆర్ అమలు చేయలేని హామీలు ఇస్తున్నారని, ఇది కూడా తెరాసకు నష్టం కలిగిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల తెరాస ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. దాని ఫలితం కూడా కనిపించడం లేదంటున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications