తెలంగాణ వచ్చినా: కోదండరాం అసహనం, కేసీఆర్ వ్యాఖ్యపై చర్చిస్తామని..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ స్వయంపాలన స్వప్నం ఇంకా పూర్తిస్థాయిలో సాకారం కాలేదని, విభజన చిక్కుముళ్లను ఇంకా అధిగమించాల్సి ఉందని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు.
టీఎన్జీవో భవన్లో ఐకాస విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. ప్రజలు చేసిన వీరోచిత పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని, అమరులను గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి ఐకాస పోరాడుతుందన్నారు. టీజేఏసీ ఇకపై కేవలం ప్రజా సంఘంగా పని చేయాలని, తమ సమావేశాలకు రాజకీయ పార్టీలను ఆహ్వానించరాదని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలను జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని తీర్మానించింది.

జేఏసీ
కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ విస్తృతస్థాయి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జేఏసీ
రాజకీయ పార్టీలను సమావేశాలకు, ఉత్సవాలకు పిలవడం లేదని ఇకపై టీజేఏసీ ప్రజాసంఘంగా మాత్రమే పని చేస్తుందని చెప్పారు.

జేఏసీ
ఉస్మానియా వర్సిటీ ఘటన పైన కూడా కోదండరామ్ స్పందించారు. ఉస్మానియా యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న కేసీఆర్ ప్రకటన, దానిపై విద్యార్థుల నిరసన అంశాలను హైదరాబాద్ నగర జేఏసీలో చర్చించాక మాట్లాడుతామన్నారు.

జేఏసీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ స్వయంపాలన స్వప్నం ఇంకా పూర్తిస్థాయిలో సాకారం కాలేదని, విభజన చిక్కుముళ్లను ఇంకా అధిగమించాల్సి ఉందని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications