జీవో నంబర్ 1పై ఏపీ సర్కార్ క్లారిటీ- కేవలం వాటిపైనే నిషేధం-వీటికి ఓకే..!
ఏపీలో కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల తర్వాత వైసీపీప్రభుత్వం జీవో నంబర్ 1 ను తీసుకొచ్చింది. దీని ప్రకారం అన్ని రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు నిషేధించింది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విపక్షాల్ని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ చీకటి జీవోను తెచ్చిందంటూ విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ మంత్రులు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం తరఫున శాంతి భద్రతల డీజీ రవిశంకర్ కూడా క్లారిటీ ఇచ్చారు.
జీవో నెం.1పై ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ ఇవాళ వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని ఆయన తెలిపారు. నియమనిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రజల భద్రత చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ జీవో తీసుకువచ్చినట్టు డీజీ వెల్లడించారు. 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చారని ఆయన తెలిపారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం ఇస్తామన్నారు. ఈ జీవోపై వాస్తవాలను మీడియా ప్రజలకు వెల్లడించాలని సూచించారు.

రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించ వచ్చని పోలీసులు ఇవాళ వెల్లడించారు. ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని పేర్కొన్నారు. అయితే కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దీంతో విపక్షాల విమర్శలకు ఇక బ్రేక్ పడవచ్చని భావిస్తున్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications