అక్బర్పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి, టిఎస్సార్కు దళిత సెగ
నిజాం ప్రభుత్వం పోయిన తర్వాతనే హైదరాబాదు ప్రాంతంలో అన్ని మతాల వారు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అలాంటి నిజాంను పొగడటం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలో మతతత్వ రాజకీయాలకు మజ్లిస్ పార్టీ యోచన చేస్తోందని ఆరోపించారు. కాగా, తనను మళ్లీ గెలిపిస్తే సంగారెడ్డికి మెట్రో రైలు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు.
టిఎస్సార్ అభ్యర్థిత్వంపై ఆగ్రహం
టి సుబ్బిరామి రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసుకున్న కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీమాంధ్ర దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కొండ్రు మురళి, బాలరాజుల నేతృత్వంలో పలువురు నేతలు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఏఐసిసి పరిశీలకులను కలిశారు.
టిఎస్సార్ అభ్యర్థిత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దళిత నేత అయిన నంది ఎల్లయ్య స్థానంలో మరో దళిత నేతకు అవకాశం ఇవ్వాల్సి ఉండెనని సూచించారు. నంది ఎల్లయ్య, రత్నబాయి వంటి నేతలకు ఇవ్వలేమని భావిస్తే.. అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఇవ్వాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు. టిఎస్సార్కు టిక్కెట్ నిరాకరించాలని, బిసి లేదా దళితన నేతకు ఇవ్వాలని వాళ్లు పట్టుబట్టారు. దీంతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని బొత్స, పరిశీలకులు వారికి నచ్చజెప్పారు.
మద్దతుంది.. గెలుస్తా: జెసి
తాము ఏ వ్యక్తికి, ఏ పార్టీకి వ్యతిరేకంగా చైతన్య రాజుతో నామినేషన్ వేయించలేదని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అధిష్టానం నుండి విభజన ఆపుతామని హామీ ఇస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటామని చెప్పారు. తమకు మద్దతు ఉందని, తాము తప్పని సరిగా గెలుస్తామని చెప్పారు.