వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే పవన్ కళ్యాణ్ ప్రచారం: 'ప్రత్యేక హోదా' రంగంలోకి జనసేన

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాకినాడ: ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ రంగంలోకి దిగింది. ఏపీకి హామీ ఇచ్చిన మేరకు భారతీయ జనతా పార్టీ హోదాను ఇవ్వాల్సిందేనని జనసేన పేరుతో నిరసనలు తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి చురకలు అంటించారు.

తాజాగా, జనసేన ప్రత్యేక హోదా ఇవ్వాలని నిరసన తెలిపింది. ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన తెలిపింది. ఆ పార్టీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జల దీక్ష పేరిట వినూత్న నిరసనకు దిగారు. ప్లకార్లు చేతబట్టిన ఆ పార్టీ కార్యకర్తలు సముద్రంలోకి దిగి మోకాళ్ల లోతు నీటిలో నిలబడి హోదా కోసం జలదీక్ష చేపట్టారు.

Jana Sena protest for Special Status for AP

ప్రత్యేక హోదా కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని అధికార బీజేపీపై ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యతను బీజేపీ విస్మరిస్తోందన్నారు.

ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి అనుకూలంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీల జెండాలు పక్కనబెట్టి హోదా కోసం పోరాడాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వాసులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఎంపీలు పోరాడాలన్నారు.

English summary
Jana Sena protest in East Godavari district for Special Status for AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X