అసమర్థున్ని అనిపించుకోవాలా?, ఆ పేరు నాకొద్దు: రాజీనామాపై జేసీ కీలక వ్యాఖ్యలు
Recommended Video

న్యూఢిల్లీ: తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని, ఎప్పట్నుంచో అనుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను పుట్టిన నాటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని.. రోజు రోజుకు దిగజారిపోతున్న రాజకీయాలను చూసి విరక్తిపుట్టిందని జేసీ అన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

వాటినిక నేను బలికావాలా?
తాను ప్రజలకు మంచి చేయాలని ఏదో ఒకటి చేస్తే.. వర్గం, కులం, మతం అడ్డువస్తున్నాయని అన్నారు. ఇన్నేళ్లపాటు రాజకీయాల్లో ఉండి.. వీటన్నింటికీ తాను బలికావాలా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పది రూపాయలు ఆశించి ఏ పని చేయలేదని.. అలాంటి ప్రజా జీవితంలో తాను లేనని జేసీ చెప్పారు.

అసమర్థున్ని అనిపించుకోవాలా?
కేంద్రం, రాష్ట్ర రాజకీయాల్లో ఆశించిన వాతావరణం లేదని జేసీ అన్నారు. కలుషితమైన ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని భావిస్తున్నట్లు జేసీ తెలిపారు. చాలా కాలం నుంచి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇన్నేళ్ళ రాజకీయంలో ఇప్పుడు అసమర్థున్ని అని అనిపించుకుంటానేమోననే భయం వేస్తోందని జేసీ వ్యాఖ్యానించారు.

జేసీపై ప్రజలకు నమ్మకం
మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే విశ్వాసం ప్రజలకు తనపైన ఉందని.. దాన్ని పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అందుకే ముందే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అనంతపురం రోడ్ల వెడల్పు సమస్యపై స్థానిక నాయకులు, సీఎం చెప్పాలని అన్నారు. రూ.40కోట్లతో రోడ్డు పనులు చేయడం ముఖ్యం, అమ్యామ్యాలు కాదని అన్నారు. తన హామీ నెరవేరకపోతే తనకు చెడ్డ పేరు వస్తుందని, ఇప్పుడు తనకు అది అవసరమా? అని ప్రశ్నించారు.

రాజీనామాపై త్వరలోనే..
దేశంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రధాని నరేంద్ర మోడీకే వెళుతుందని, ఆయన డైరెక్టుగా బాధ్యుడు కాకున్నా.. ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని జేసీ అన్నారు. తాను మీడియాలో కనిపించేందుకు ఏమీ చేయనని చెప్పారు. తాను మీడియాకు చెప్పే రాజీనామా చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications