ఇక అప్పులెవరిస్తారు, కొత్తదేం కాదు: 'కాల్ మనీ'పై జెసి ఆసక్తికర వ్యాఖ్య
అనంతపురం: వడ్డీ వ్యాపారుల పైన చర్యలు తీసుకుంటే ప్రజలకు అప్పులు ఇచ్చేది ఎవరని జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. కాల్ మనీ వ్యవహారం ఈ రోజుది కాదని, ఎప్పటి నుంచే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల మద్దతుదారులు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పారు.
ఇటీవల పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జెసి ప్రతి విషయంలోను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు.

వైసిపి కార్యకర్తలు, బంధువుల ఆందోళన
కడప జిల్లాలో శుక్రవారం నాడు పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బెంగళూరులో మృతి చెందిన వైసిపి కార్యకర్తల మృతదేహాలతో వారు తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
నలుగురి మృతికి కారణమైన వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications