వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా అరెస్ట్‌తో న్యాయం జరిగితే, వల్లకాదు.. అమ్మేస్తా: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Prabhakar Reddy
హైదరాబాద్: తాను అరెస్టు అయినంత మాత్రాన మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు ప్రమాద బాధితులకు న్యాయం జరగదని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నేత జెసి ప్రభాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందంటే తాను అరెస్టు అయ్యేందుకు సిద్ధమేనని చెప్పారు.

తాను అరెస్టయినంత మాత్రాన న్యాయం జరగదని, బాధితులకు చెల్లించే నష్టపరిహారం కోసం అందరితో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. ప్రయివేటు బస్సులతో ట్రావెల్స్ నిర్వహించడం తన వల్ల కాదని వచ్చే ఏడాది మార్చిలోగా తనకు ఉన్న బస్సులన్నింటినీ అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

కాగా, అక్టోబర్ 30వ తేదిన జరిగిన మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాద బాధితులు శుక్రవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఆరని మంటలు పేరుతో శుక్రవారం దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన బస్సు యజమాని జెసి ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశాయి.

ఈ ధర్నాలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా పాల్గొని బాధితులకు అండగా నిలబడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో జాతీయ రహదారి పైన జరిగిన వోల్వో బస్సు ప్రమాదం ఘటనలో 45 మంది మృత్యువాత పడ్డారు.

English summary

 Ananthapuram senior Congress leader JC Prabhakar Reddy on Tuesday responded on mahaboobnagar volvo bus accident issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X