ఎట్టకేలకు 'కాపు' రిజర్వేషన్స్: సభలోకి బిల్లు, బీసీ 'ఎఫ్' కేటగిరీలో చేర్చిన ప్రభుత్వం..
అమరావతి: 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామి ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక దాని పట్ల తాత్సారం చేస్తూ వస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.
ఎట్టకేలకు ఆ విమర్శలకు కొంతమేర చెక్ పెట్టేలా అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు శనివారం సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీలో చేరుస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. బీసీ ఎఫ్ కేటగిరీకి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు సభలో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ చిత్తశుద్ది నిరూపించుకున్నామని అన్నారు. ఇప్పటికే కాపు సంక్షేమం కోసం రూ.2100కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి స్వయం ఉపాధి కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు.
కాపు రిజర్వేషన్లలో భాగంగా.. బలిజ, వంటరి, కాపు, తెలగ కులాలను బీసీ ఎఫ్ కేటగిరీలో చేరుస్తున్నట్లు తెలిపారు. తాజా బిల్లు ద్వారా వీరందరికీ లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications