ఎట్టకేలకు 'కాపు' రిజర్వేషన్స్: సభలోకి బిల్లు, బీసీ 'ఎఫ్' కేటగిరీలో చేర్చిన ప్రభుత్వం..
అమరావతి: 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామి ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక దాని పట్ల తాత్సారం చేస్తూ వస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.
ఎట్టకేలకు ఆ విమర్శలకు కొంతమేర చెక్ పెట్టేలా అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు శనివారం సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీలో చేరుస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. బీసీ ఎఫ్ కేటగిరీకి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కాపు రిజర్వేషన్: విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే, మంజునాథన్ కమిషన్ నివేదిక ఏం చెప్పిందంటే..
బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు సభలో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ చిత్తశుద్ది నిరూపించుకున్నామని అన్నారు. ఇప్పటికే కాపు సంక్షేమం కోసం రూ.2100కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి స్వయం ఉపాధి కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు.
ముద్రగడ పోరు: అడకత్తెరలో తెలుగు తమ్ముళ్లు: కిర్లంపూడిలో టెన్షన్ టెన్షన్
కాపు రిజర్వేషన్లలో భాగంగా.. బలిజ, వంటరి, కాపు, తెలగ కులాలను బీసీ ఎఫ్ కేటగిరీలో చేరుస్తున్నట్లు తెలిపారు. తాజా బిల్లు ద్వారా వీరందరికీ లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు.