పోలవరంతో పెను ముప్పు: కవిత, కెసిఆర్ రివ్యూ

Kavitha warns threat with Polavaram
న్యూఢిల్లీ/ హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత లోక్‌సభలో అన్నారు. కేంద్రం ఏరాష్ట్రాన్ని సంప్రదించకుండా పోలవరంపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని ఆమె అన్నారు. ప్రాజెక్టుకు ఇష్టాను సారంగా అనుమతులు ఇవ్వడం సరికాదని ఎంపీ కవిత సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని కవిత అన్నారు.

రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం హైదరాబాదులోని సచివాలయంలో సమావేశమయ్యారు. పోలీస్ లోగో, యూనిఫామ్, కొత్త వాహనాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులపై హోంశాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు.

హైదరాబాద్ పరిధిలో ఉన్న పోలీసు శాఖలో పలు సంస్కరణలకు కెసిఆర్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు కూడా విడుదల చేశారు. 15 రోజుల్లో కొత్త వాహనాలను కెసిఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+