కాంగ్రెసుకు దూరం: బిజెపి వైపు చూస్తున్న కెసిఆర్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తుకు గండి పడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకునే దిశగా ఆయన కదులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరితే పొత్తుకు అభ్యంతరం లేదన్న సంకేతాలు బిజెపి, తెరాసల నుంచి వస్తున్నాయి. ఈ విషయంలో తెరాస గానీ బిజెపి గానీ బహిరంగంగా స్పందించడం లేదు. అదే సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలను తోసిపుచ్చడం లేదు.
తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కొద్ది రోజులుగా బిజెపి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి పరస్పరం మాట్లాడుకున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా జరిపారు. ఈ సందర్భంగా బిజెపి నుంచి 40-45 అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాలు కావాలనే ప్రతిపాదన వచ్చింది. కెసిఆర్ మాత్రం 20-22 అసెంబ్లీ, రెండు లోక్సభ (సికింద్రాబాద్, మల్కాజిగిరి) స్థానాలు ఇస్తామని చెప్పినట్లు సమాచారం.

ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే, తప్పక మద్దతు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారని, చివరికి తమకు 30 అసెంబ్లీ, ఐదారు లోక్సభ స్థానాలు కేటాయిస్తే తెరాసతో పొత్తుకు బిజెపి నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తుపై కెసిఆర్ తమను సంప్రదించిన విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి తెలియజేసింది.
తెలుగుదేశం పార్టీతో కన్నా తెరాసతో పొత్తు పెట్టుకోవటమే నయమనే భావనలో తెలంగాణ బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాము కోరిన స్థానాలను తెలుగుదేశం ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని, తెరాసతో వెళితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో కాకపోయినా మెజార్టీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది.
తెరాసతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేసే అన్ని లోక్సభ స్థానాల్లోనూ విజయం సాధించవచ్చనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదించి, వారి ఆమోదం తీసుకోవటం కోసమే కిషన్రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. తెరాస, బిజెపి పొత్తు కుదిరితే తాము ఆశిస్తున్న స్థానాలు ఏమిటి, వారు కోరుకునే స్థానాలు ఏమిటనే విషయంలో ఆయన కేంద్ర పార్టీకి ఒక నివేదిక కూడా సమర్పిస్తారని తెలుస్తోంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications