ఖైరతాబాద్ గణపతి లడ్డు ప్రసాదం పంపిణీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతి చేతిలో 11 రోజులు నైవేద్యంగా ఉన్న భారీ లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం గురువారు ఉదయం ప్రారంభమైంది. గురువారం ఉదయం 11:45 గంటలకు లడ్డూ ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ బుధవారంనాడు తెలిపారు.

బుధవారం అర్ధరాత్రి తర్వాత లడ్డూను తెరిచి పంపిణికి ప్రణాళికలు సిద్ధం చేశారు. లడ్డ్డూను నైవేద్యంగా సమర్పించిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబుకు కొంత భాగాన్ని, ఉత్సవ కమిటీ సభ్యుల కోసం మరికొంత భాగాన్ని కేటాయించారు. మిగతా లడ్డూను ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య లడ్డూను గణేష్ ఉత్సవ కమిటి వేదికపై ఉంచారు.

లడ్డూ ప్రసాదం కోసం పెద్ద యెత్తున భక్తులు ఖైరతాబాద్కు తరలివచ్చారు. దీంతో సైఫాబాద్ ఏసీపీ మహ్మద్ ఇస్మాయిల్ నేతృత్వంలో నలుగురు ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలు, 4 ప్లాటూన్ల పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ అశోక్ బుధవారంనాడు తెలిపారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications