వైకాపాలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి...ఈసారి ఫిక్స్
శ్రీకాకుళం:శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసిపిలో చేరేందుకు సంసిద్దమయ్యారు. నిజానికి కిల్లి కృపారాణి వైసిపిలో చేరబోతున్నట్లు సుమారు 10 నెలల క్రితమే జోరుగా ప్రచారం జరిగింది.
అయితే నియోజకవర్గం విషయంలో వైసిపి ఇచ్చిన ఆప్షన్ పై తేల్చుకోలేకపోవడంతో పాటు వైసిపి గెలుపుపై పూర్తి విశ్వాసం లేకపోవడంతో ఆమె ఆ పార్టీలో చేరే విషయంలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఎటూ తేల్చుకోలేక పోయారని తెలుస్తోంది. అయితే జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని ఆ పార్టీలో చేరేందుకు మానసికంగా సిద్దమయ్యారట.

కిల్లి కృపారాణి...ప్రస్థానం
డాక్టర్ అయిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ తరుపున 2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఎంపీగా పోటీచేసి ఓడిపోయింది. ఆ తరువాత 2009 జరిగిన ఎన్నికలలో నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచింది. ఆ క్రమంలో కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత.

కబురు అందగానే...గ్రీన్ సిగ్నల్
మరోవైపు గతంలో వైసిపిలో ఎవరైతే చేరేందుకు సుముఖత చూపి ఆ తరువాత సైలెంట్ అయ్యారో ఆ నేతలందరికి వైసిపి నుంచి పార్టీలో చేరే విషయం కబురు వెళుతోందట. అలా కబురు అందగానే కిల్లి కృపారాణి ఈసారి తాను వైసిపిలో చేరేందుకు సంసిద్దమైనట్లు తెలిపారట. అయితే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నప్పుడు ఆ సమయంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారట.

ముందే చేర్చుకోవాలని...వైసిపి
పాదయాత్ర శ్రీకాకుళం చేరేందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నందున కిల్లి కృపారాణిని ముందే పార్టీలో చేరేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందట. అలా వీలుకాని పక్షంలో ముందుగా ఆమెతో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన ఇప్పించాలని ప్రయత్నం చేస్తోందట. అయితే వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నా ఇంకా కిల్లి కృపారాణి ఇంకా డైలమాలోనే ఉన్నారని, అందుకే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం చేరుకున్నప్పుడు పార్టీలో చేరుతానని చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా అయితే సమీకరణాలు అంచనా వేసేందుకు ఇంకా వ్యవధి దొరుకుతుందని ఆమె ఆలోచన అంటున్నారు.

పోటీ ఎక్కడనుంచి?...
కిల్లి కృపారాణి స్వస్థలం టెక్కలి. ఈ నియోజవకర్గంతో తనకున్న అనుబంధం రీత్యా ఎమ్మెల్యే టికెట్ తనకివ్వాలని కృపారాణి జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ తరుపున ఇప్పటికే ఆ సీటు కోసం ఇద్దరు పోటీ పడుతుండటంతో వేరే స్థానం గురించి ఆలోచించాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ఆమె వైసిపిలో చేరితే కళింగ సామాజికవర్గం బలంగా ఉన్న పలాసా నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి దిగే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసిపిలో చేరే విషయం వీలైనంత త్వరలోనే ఆమెతోనే ప్రకటింపచేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications