వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయాల్లో లేను.. చెప్పను: కిరణ్ రెడ్డి, జనసేన పార్టీలో చేరుతున్నారా?
నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
విజయవాడ: నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ఆయనను నోట్ల రద్దు అంశంపై ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అసలు తాను రాజకీయాల్లో లేనని, ఈ విషయమై స్పందించనని చెప్పారు.
అదే సమయంలో జనసేన పార్టీలో చేరుతారని, భారతీయ జనతా పార్టీలో చేరరని అంటూ.. ఓ విలేకరి ప్రశ్నించారు. దానిపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను ఆ విషయాలు ఏమీ చెప్పదలుచుకోలేదని అన్నారు. నేను ఆ విషయాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు.
Comments
kiran kumar reddy pawan kalyan jana sena bjp nara rohit demonetisation chandrababu naidu ys jagan andhra pradesh కిరణ్ కుమార్ రెడ్డి నారా రోహిత్ నోట్ల రద్దు చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ ఆ
English summary
Kiran Kumar Reddy is not ready to respond on demonetisation as he is not in politics.