సిఎం మార్పు: నవ్వుతూ కారెక్కి వెళ్లిన కిరణ్ రెడ్డి, లైట్

అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ... ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మ్యాచ్ ఆడుతుంటే చూసే అవకాశం ఉందని కానీ తమకు అప్పట్లో అది లేదని కిరణ్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు.
అందరూ బడికి పోయేలా, ఆడపిల్లలను బడికి పంపించేలా ప్రతిజ్ఞ తీసుకుందామన్నారు. ముప్పయ్యేళ్ల క్రితం ఇంత టెక్నాలజీ లేదని అప్పుడు తమకు సెల్ఫోన్, టీవిల గురించి తెలియదన్నారు. ఇప్పుడు సచిన్ ఆడుతుంటే పిల్లలు ప్రత్యక్షంగా టీవిల్లో చూస్తున్నారని, తాము మాత్రం రేడియోల్లో కామెంట్రీ వినే వాళ్లమన్నారు.
ఇలాంటి టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ప్రపంచం ఓ కుగ్రామంలా తయారయిందని, విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ రోజు మీకున్న అవకాశాలు తమకు అప్పుడు లేవన్నారు.
అమెరికాలో చేసే పనిని హైదరాబాదు నుండి చేస్తున్నామని, ప్రపంచంలోని యాభై శాతం విమానాలకు హైదరాబాదు నుండి సూచనలు ఇస్తున్నారని, మంగళయాన్కు చెందిన పలు విడి భాగాలను హైదరాబాదులోనే చేశామని చెప్పారు. టెక్నాలజీతో పాటు మనం దూసుకెళ్లాలన్నారు.
ప్రతి ఒక్కరు చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, చదువుతోనే ఆలోచన పరిణితి వస్తుందన్నారు. విద్యార్థులు తాము ఏ రంగంలో రాణిస్తారో తమను తాము తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడితే ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుందని, భారత్, చైనా విద్యార్థులు బాగా కష్టపడతారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కితాబిచ్చారన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలే గాని కష్టపడి చదువొద్దని సూచించారు. ఉన్నత శిఖరాలు చేరేందుకు రెండు మార్గాలు ఉంటాయని సరైన మార్గంలో వెళితే కష్టపడినా విజయం సాధిస్తామని, అందులో సంతోషం ఉంటుందన్నారు. అడ్డదారిలో వెళ్లి గెలిస్తే అది అసలైన విజయం కాదన్నారు. కష్టపడకుండా ఏదీ మన వద్దకు రాదని తెలుసుకోవాలన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications