వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కి తగ్గం: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram opposes Polavaram ordinance bill
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లు లోకసభలో ఆమోదం పొందినంత మాత్రాన తాము వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. పోలవరం విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ బంద్ నేపథ్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

పోలవరం అంశం అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం కాదని, ఆదివాసుల హక్కులపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని అన్నారు. పోలవరంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

లోక్‌సభలో ఆమోదం పొందినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని న్యాయపోరాటం చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. పోలవరం బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని నిరసిస్తూ చేపట్టిన బంద్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

తెలంగాణ జెఎసి, సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను సీపీఎం నేతలు దహనం చేశారు. తెలంగాణవ్యాప్తంగా బంద్ జరుగుతోంది.

English summary
Telangana political JAC chairman Kodandaram said that they will continue to fight against Polavaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X