వారి సంగతేంటి?: కోదండరాంపై కొండా సురేఖ సీరియస్
తమను ఉద్యమ ద్రోహులు అంటున్న కోదండరామ్కు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ద్రోహులుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పన్నెండు వందల మంది యువకులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెసు పార్టీ పైన ఏం సమాధానం చెబుతారన్నారు. నీటిని ఆంధ్రాకు తరలించిన ద్రోహి తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఉద్యమాన్ని, ఉద్యమకారులను అణగదొక్కిన పొన్నాల తెలంగాణ ద్రోహి కాదా అన్నారు.
తెలంగాణ కోసం రాజీనామా చేయాలని జెఏసి ఆదేశిస్తే తాను రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెసు నేతలు రాజీనామా చేయలేదన్నారు. వారు ఉద్యమ ద్రోహులు కాదా అన్నారు. 1200 మంది విద్యార్థుల ఆత్మాహుతిలో కాంగ్రెసు పార్టీ పాత్ర లేదా అన్నారు. కాగా, తెరాసలో కొండా సురేఖ, మహేందర్ రెడ్డి తదితరుల చేరికను కోదండరామ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
నాయకులు వెళ్లినా: ఆనం
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ నుండి నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలు వెంటే ఉన్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాదులో చెప్పారు. టిక్కెట్ల కోసం పార్టీలో పోటీ నెలకొందన్నారు. మాజీ మంత్రులు లోకసభకు పోటీ చేయాలనుకుంటే దానిని అధిష్టాం పరిశీలిస్తుందన్నారు.