అమెరికాలో తెలుగు యువకుడు మృతి: టీడీపీ నేత ఇంట విషాదం
వాషింగ్టన్/కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలంలో గొట్టుముక్కల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.
Recommended Video

వన్ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్
నార్త్ కరోలినా సమీపంలో ఛార్లెట్ వద్ద గల జలపాతం సదర్శనకు వెళ్లిన నాగార్జున ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, నాగార్జున గొట్టుముక్కల గ్రామానికి చెందిన టీడీపీ నేత దివంగత గోగినేని వెంకట్రావు మూడో కుమారుడు.

ఉద్యోగరీత్యా పదేళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిన నాగార్జున.. అక్కడే స్థిరపడ్డారు. నాగార్జున ఆకస్మిక మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications